ఎస్ఎల్బీసీలో కోట్ల రూపాయల ముడుపులు.. ఆ విచారణ జరిపించాల్సిందే?

frame ఎస్ఎల్బీసీలో కోట్ల రూపాయల ముడుపులు.. ఆ విచారణ జరిపించాల్సిందే?

ఎస్ఎల్బీసీలో కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం దాగి ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. హత్యలపైన విచారణ జరిపించాలన్నారు. కేంద్రం నుంచి అనేక శాఖల ద్వారా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  అన్నారు.


రేవంత్ రెడ్డి ప్రకటనలు విలువైనవి కావని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందనే అంశంపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ చేశారు. ఎస్ఎల్బీసీ సంఘటన తెలంగాణ ప్రజానీకాన్ని కుదిపివేసిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.


వర్కర్స్ క్షేమ సమాచారాలు ఇంకా తెలియలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండకు మంచి నీరు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఎస్ఎల్బీసీని ప్రారంభించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గుర్తు చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు.. కానీ వ్యయం పెరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జేపీ సంస్థ తట్ట మట్టి తీయలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎనిమిది సంవత్సరాల తరువాత పనులు ప్రారంభించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. టీబియం ద్వారా పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ ప్రమాదం జరిగిందని..  కాంగ్రెస్ నాయకులు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు జేబు నింపుకునేందుకు ప్రాజెక్టుల డిజైన్ రూపకల్పన చేస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్  ఆరోపించారు. మరి ఇందులో అసలు లెక్కలు ఎవరు తేలుస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: