వార్నీ.. చంద్రబాబు, లోకేష్‌ను కూడా తప్పుదారి పట్టించారా?

ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత జరుగుతున్న గొడవులు అన్నీ ఇన్నీ కావు. గ్రౌండ్ లెవన్ లో మాత్రమే కాదు. సోషల్ మీడియా కూడా ఈ వ్యవహారంతో రగిలిపోతుంది. దాడులు జరుగుతున్నాయని ఇలా మీడియాలో వార్తలు వచ్చాయో లేదో.. లక్షల ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. నిజమైన దాడులు గోరంత అయితే ఫేక్ దాడులు కొండంత.

అలాంటి ఫేక్ వార్తను నారా లోకేశ్ ను తీవ్ర ఇబ్బంది పెట్టింది. ఓ ఫేక్ పోస్టుతో పరువు పోగోట్టుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత విషయాల్లో గాయాలైన మహిళల ఫొటోలను పోలింగ్ తర్వాత జరిగాయ్ అన్నట్లు లోకేశ్ పోస్టు చేశారు. ఇది ఫేక్ అని పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎన్నికల రోజు వైజాగ్ లోని అక్కిరెడ్డి పాలెంలో గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని.. ఆ కుటుంబంపై దాడి చేశారని.. వాళ్లను గాయపరిచారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది.

పైగా దీనిని ఎల్లో మీడియా హైలెట్ చేస్తూ ఫొటోలు కవర్ చేసింది. బాధితులు కూడా ఇదే అదునుగా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో లోకేశ్ దీనిని ఎన్నికల దాడి అని షేర్ చేశారు. తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండి పడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్యగా అంటూ దుమ్మెత్తిపోశారు.

ఇక టీడీపీ సానుభూతి పరులంతా సోషల్ మీడియాలలో ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ రెచ్చిపోయారు. ఐతే విశాఖ పోలీసులు అసలు విషయం బయట పెట్టారు. అది అసలు పొలిటికల్ దాడి కాదని.. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుపు పొరుగు వారు ఒకరిపై మరొకరు దాడి చేశారని నిగ్గు తేల్చారు. ఈ గొడవలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ పోస్టులకు నమ్మొద్దని సూచించారు. ఈ అంశాన్ని తీసుకొని వైసీపీ నేతలు టీడీపీ నేతలను విమర్శించడం మొదలు పెట్టారు. ఓ ఫేక్ పోస్టు చంద్రబాబు, నారా లోకేశ్‌ను తప్పుదోవ పట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: