పిఠాపురంలో "మనమే" ప్రీ రిలీజ్ ఈవెంట్... చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మనమే అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా నటించగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో నిన్ననే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదగా విడుదల చేయించింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ... గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ సినిమా విడుదలకు ఒకటి , రెండు రోజుల ముందు చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 5 వ తేదీన చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ "పిఠాపురంలో" భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు ప్రకటించాయి. దానితో జూన్ 4 వ తేదీన రిజల్ట్ రానున్న నేపథ్యంలో జూన్ 5 వ తేదీన పిఠాపురంలో భారీ ఎత్తున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు , దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫుల్ బజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: