నెటిజన్ కామెంట్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్..!!

murali krishna
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ఈ సినిమాలో మహి పాత్ర పోషించింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు.అటు సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భుజానికి గాయాలు అయినట్లు కనిపించింది. నిజానికి ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సుమారు 150 గంటలకు పైగా క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే రెండు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు ఆమె తన ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆమె కష్టాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, మరికొంత మంది మాత్రం ట్రోల్ చేశారు. అయితే, మరీ చీప్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు జాన్వీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చి నోరు మూయించింది.
భుజానికి గాయమైన వీడియో చూసి ఓ నెటిజన్ జాన్వీ కపూర్ను ట్రోల్ చేశాడు. టెన్నిస్ బాల్తో ఆడిన క్రికెట్ లో మీకు దెబ్బలు తగిలాయా? అంటూ హేళన చేశాడు. నవ్వు ఎమోజీలు పెట్టాడు. ఈ కామెంట్ కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “నాకు క్రికెట్ బాల్ తో ఆడుతున్నప్పుడే గాయాలు అయ్యాయి. అందుకే టెన్నిస్ బాల్ తో ఆడాల్సి వచ్చింది. నా భుజానికి ఉన్న బ్యాండేజ్ చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఓసారి అసలు వీడియో మొత్తం చూస్తే బాగుంటుంది. అప్పుడు మీరు వేసే జోక్స్ కు నేను కూడా నవ్వుతాను” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ కౌంటర్ తో నెటిజన్ షాక్ అయ్యాడు. ‘సారీ మేడం’ అని చెప్పి సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘RC 16’లో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: