విమానం ఇంజన్లోకి.. కాయిన్స్ వేసిన మహిళ.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతుంది. ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిన విషయాలను తెలుసుకోవడానికి  కొందరు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా అవకాకయ్యేలా చేస్తూ ఉంటాయి. ఈ భూమి మీద ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉన్నారా అని అనిపించేలా చేస్తూ ఉంటాయి కొన్ని ఘటనలు.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నదులలో లేదంటే గుండాలలో ఇక ఏకంగా కొన్ని నాణేలను నీళ్లలో వేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా డబ్బులను నీళ్లలో వేసి మనసులో ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇక రైలు ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా నదిపై రైలు వెళ్తున్నప్పుడు ఏకంగా నదిలో ఇలా నాణాలను వదిలేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఇలాంటివి కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా మంది చూసి చేసి ఉంటారు.

 అయితే ఇక్కడ ఒక ప్రయాణికురాలు ఇలాగే చేసింది. అయితే ఏకంగా ట్రైన్ లో వెళ్తున్నప్పుడు లేదంటే బస్సులో వెళ్తున్నప్పుడు కాదు ఏకంగా విమానంలో వెళుతున్నప్పుడు. ఆమే ఏకంగా ఇంజన్లోనే కాయిన్స్ విసిరింది. దీంతో ఆమె చేసిన పనికి చివరికి విమానం ఆగిపోయింది. చైనాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల ప్రయాణికురాలు చేసిన పనికి విమానం నాలుగు గంటలు ఆగిపోయింది. ఇంజన్లోకి కాయిన్స్ విసిరింది. ఇది గమనించిన సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించగా.. అదృష్టం కలుగుతుందని ఇలా చేస్తున్నట్టు సమాధానం చెప్పింది. అయితే ఆమె ఇలా చేసిన సమయంలో విమానంలో ఏకంగా 148 మంది ప్రయాణికులు ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: