ఏంటీ.. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఆగిపోవడానికి.. నెక్లెస్ కారణమా?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా అనే మాయలో బ్రతికేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ని పనులు ఉన్న అటు సోషల్ మీడియా వాడటం మాత్రం అస్సలు మానటం లేదు. అయితే ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా మనిషి ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో ఈ సోషల్ మీడియా మాయ నుంచి బయటపడటం అటు మనిషి వల్ల అస్సలు కావడం లేదు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ ఏవి అంటే ఇక మొదటి రెండు స్థానాలలో నిలుస్తాయి ఫేస్ బుక్ తో పాటు ఇంస్టాగ్రామ్ కూడా.

 ఇక ఈ రెండు యాప్లు కూడా మనిషి రోజువారి జీవితంలో ఇక కొన్ని గంటలను వీటి కోసమే సమయం గడిపేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక అంతలా మనిషి కూడా కూడా ఈ రెండు యాప్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. అయితే ఇక ఇంతలా వాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఈ యాప్స్ పని చేయడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అమ్మో ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది అని చెబుతారు నెటిజెన్స్. అయితే ఇలాంటి ఒక భయంకరమైన అనుభవమే ఎదురయింది సోషల్ మీడియా ప్రియులకు. ఎందుకంటే ఎప్పుడు గంటలు తరబడి కాలం గడిపే ఫేస్ బుక్,  ఇన్స్టాగ్రామ్ సేవలు ఇక మంగళవారం రాత్రి అకస్మాత్తుగా నిలిచిపోయాయి అని చెప్పాలి.

 దీంతో ఈ రెండు యాప్స్ వాడుతూ టైంపాస్ చేసే ఇంటర్నెట్ జనాలు ఇక ఈ యాప్ పనిచేయకపోవడంతో పిచ్చివాళ్ళలా మారిపోయారు. అయితే సాంకేతిక లోపమే ఇలా జరగడానికి కారణమని మెటా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లు ఆగిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ ఒక నేటిజన్ సెటైరికల్ పోస్ట్ పెట్టగా.. ఇది వైరల్ గా మారిపోయింది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్  లలో నీతా అంబానీ ధరించిన 500 కోట్లు నెక్లెస్ పైన చర్చ జరుగుతుంది. అయితే అది తన భార్య చూస్తే తనకు కూడా నెక్లెస్ కొనివ్వమంటుంది అని జుకర్ బర్గ్ గ్రహించాడు. అందుకే యాప్స్ నిలిపివేశారు అంటూ ఒక నేటిజన్ సెటైరికల్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: