అత్తమామల వేధింపులు.. ఇద్దరి తోటికోడళ్లు కలిసి ఏం చేశారో తెలుసా?

praveen
సాధారణంగా సినిమాల్లో అత్తా కోడలు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారని.. ఒకరిపై ఒకరు అమితమైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు అనట్లుగా సీన్స్ ని తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే సీరియల్స్ లో మాత్రం అత్తా కోడలు మధ్య ఉండే ట్రాజెడీ డ్రామానే ఇక ఎపిసోడ్స్ గా తీస్తూ ఇక మంచి రేటింగ్స్ సొంతం చేసుకోవాలని బుల్లితెర సీరియల్స్ డైరెక్టర్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా సీరియల్స్ ప్రభావమో లేదంటే నిజంగానే అత్తా కోడళ్ళ మధ్య అసలు సఖ్యత వుండదో తెలియదు. కానీ ఏ ఇంట్లో చూసినా అత్తా కోడల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది.

 సినిమాల్లో చూపించినట్లుగా కోడలు అత్తయ్యను తల్లి అనుకోవడం.. ఇక కోడలిని అత్త సొంత కూతురు లానే చూసుకోవడం ఇక రియల్ లైఫ్ లో ఎక్కడ కనిపించదు అని చెప్పాలి. ఒకవేళ కనిపించినా కోటికో నూటికో ఎక్కడో చోట అత్తా కోడళ్లు ఇలా సఖ్యతతో ఉంటారు. ఈ క్రమంలోనే అత్తమామలు వేధిస్తున్నారని కోడలు ఎప్పుడూ భర్తల దగ్గర కంప్లైంట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇక మీ భార్యలు పనిచేయడం లేదు అని తల్లిదండ్రులు కొడుకుల దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. మధ్యలో బలయ్యేది మాత్రం భర్తలే. సీరియల్స్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.

 అయితే ఇటీవల ఏలూరు జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా అత్తామామల వేధింపులు తాళలేకపోయిన తోటి కోడళ్లు ఇద్దరు కూడా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృతదేహం లభ్యం కాగా పెద్ద కోడలు రూపాదేవి మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే తోటి కోడళ్లు ఇద్దరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్నారు అన్న వార్త తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఇక వారి అత్తమామల ఇల్లుని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్తమామలు, భర్త పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: