భర్త చనిపోయాడని భార్య సూసైడ్.. కానీ చివరికి?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి పెళ్లి అనే బంధంతో ఒకటైన తర్వాత కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తోడునీడుగా ఉండాలి అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. ఏకంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో కాదు ఏకంగా బద్ధ శత్రువులేమో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చిన్నచిన్న గొడవలనే పెద్దదిగా చేసుకుంటూ.. చివరికి పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇలాంటి గొడవలను ఒకరి ప్రాణులు ఒకరు తీసుకుంటున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.

 ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భావన నేటి రోజుల్లో యువతీ యువకుల్లో కూడా కలుగుతుంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తల బంధంలో ఉండే ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచే కొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఏకంగా భార్య లేదా భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక చివరికి తుదిశ్వాసులోను కట్టుకున్న వారితోనే తోడుగా ఉంటామని భావిస్తూ ప్రాణాలు వదులుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 హైదరాబాద్ నగరంలోని మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహీంపుర వాసి అమన్ కుమార్ సింగ్ అనే 36 ఏళ్ల వ్యక్తి దూల్పేట లోని అరంఘర్ లో ఉంటున్నాడు. ఇక అతనికి అస్మిత అనే అమ్మాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గచ్చిబౌలిలో జాబ్ చేసే అమన్ కుమార్ డిసెంబర్ 26వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్ తో ఆకస్మిక మరణంచెందాడు. భర్త మరణాన్ని అస్మిత అస్సలు జీర్ణించుకోలేకపోయింది. ఇక అతను చనిపోయిన నాటి నుంచి అతని ఫోటో చూస్తూ కుమిలిపోయింది. ఇటీవల పుట్టింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా భర్త చనిపోయాడని భార్య సూసైడ్ చేసుకోగా.. చివరికి పిల్లలు అనాధలుగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: