దొంగతనానికి వెళ్లి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా..??

N.ANJI
దొంగతనాలకు పాల్పడే దొంగలు చాలా అలర్ట్‌గా ఉంటూ వారు వచ్చిన పని కనిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దొంగలు రాత్రి సమయంలో దొంగతనాలకు వచ్చి నిద్రపోతూ అడ్డగా బుక్కైపోతున్నారు. తాజాగా అదే కోణంలో మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌ లో పవన్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. అయితే ముగ్గురు యువకులు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్లాన్ వేసుకున్నారు. ఇక ఆ ముగ్గురిలో ఒకడు దీపక్. అనుకున్నట్టుగానే ముగ్గురూ దొంగతనానికి సిద్ధమైయ్యారు. అయితే పవన్ గుప్తాతో సహా కుటుంబ సభ్యులంతా భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు. కాగా ఫ్యామిలీ అంతా ఒకే రూమ్‌లో నిద్రపోతున్నారు.
ఇక మిగిలిన రూములన్నీ ఖాళీగా ఉన్నాయి. అయితే ఇంట్లో వాళ్లంతా పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత దీపక్‌ తో పాటు మరో ఇద్దరు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. అంతేకాదు.. ఎవరూ లేని రూమ్స్‌ లో డబ్బు, నగల కోసం వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఒక రూమ్‌లో లాకర్ వారి కంటికి చిక్కింది. ఇక ఆ లాకర్ చూడగానే.. మీరు పని కానివ్వండని.. తనకు నిద్రొస్తుందని.. వెళ్లి పక్క రూంలో పడుకుంటానని దీపక్ మిగతా వారితో చెప్పాడు.
అయితే దీపక్ వెళ్లి ఆ రూంలో బెడ్‌పై పడుకుని నిద్రలోకి జారాడు. ఇక ఆ ఇద్దరూ దోచుకుని అక్కడి నుంచి మెల్లిగా వెళ్లిపోయారు. కాగా.. ఇంటి యజమాని తెల్లారి చూసేసరికి తన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించాడు. అంతేకాదు.. ఓ గదిలో కప్ బోర్డు విరిగిపోయి కనిపించడం, లాకర్ తెరిచి ఉండటంతో మిగిలిన రూమ్స్‌లో కూడా చూశారు. అయితే ఓ రూంలో బెడ్‌పై ఆదమరిచి నిద్రిస్తున్న దీపక్‌ను పవన్ గుప్తా చూసి.. మెల్లిగా ఆ రూం లాక్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీపక్‌ను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: