పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను నీచంగా..
నేటి సమాజంలో అక్రమ సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అక్రమ సంబంధాల వల్ల మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలిసి కూడా పది నిమిషాల సుఖం కోసం వాటి వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ అక్రమ సంబంధాలు పచ్చని కాపురాలను కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యభర్తల్నీ, వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత భర్తను అతి దారుణంగా హతమార్చింది.
ఈ ఘటర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుడిపూడి నాగరాజు అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం భూలక్ష్మి అనే యువతితో వివాహం అయింది. నాగరాజు కుటుంబంతో కలిసి పెదపాడు మండలంలోని వట్లూరులో నివాసం ఉంటున్నాడు. నాగరాజు తాపీ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక అదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి నాగరాజు వద్దే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సురేస్ తరచూ నాగరాజు ఇంటికి రావడంతో భార్య భూలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భూలక్ష్మి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి పధకం వేసింది. ఇందులో భాగంగా.. ప్రియుడు సురేష్తో కలిసి భూలక్ష్మి ముందు ప్లాన్ చేసినట్టుగానే ఈ నేల 6 తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న భర్తను ఇద్దరూ కలిసి రాడ్డుతో తలపై కొట్టి హతమార్చారు. అనంతరం హత్యను ఉరిగా మార్చేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం నాగరాజు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయాలు బయట పడ్డారు. ఈ క్రమంలోనే నింధితులు సురేష్, భూలక్ష్మి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.