కేసీఆర్‌.. ఇది ప్రజాస్వామ్యం?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్‌ గెలుస్తుందా.. లేక కాంగ్రెస్ విజయం సాధిస్తుందా.. ఇప్పుడు తెలంగాణలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. అయితే.. గతంలో కేసీఆర్ గెలిచినంత సులభంగా ఇప్పుడు గెలవడం కష్టం అన్న మాట మాత్రం వినిపిస్తోంది. పదేళ్ల పాటు ఓ నాయకుడి పాలన సాగిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత సహజమే.. కానీ ఆ వ్యతిరేకత పాలన గురించో.. పథకాల గురించో కాకుండా.. కేసీఆర్ కుటుంబం వైఖరి కారణంగా అన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ వంటి వారి వైఖరి ప్రజాస్వామ్యయుతంగా కనిపించట్లేదని.. రాజరికపు పోకడలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. మనది ప్రజాస్వామ్యం.. ఇది రాజరికం కాదన్న చర్చ జరుగుతోంది. అందుకే పథకాలు బాగున్నా.. పెద్దగా పాలనలో ఇబ్బందులు లేకున్నా.. పదేళ్ల తర్వాత కేసీఆర్ పాలన అంటే విముఖత కనిపిస్తోందన్న వాదన ఉంది. మరి జనం ఏం తీర్పు చెబుతారో డిసెంబర్ 3 తర్వాత కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: