చిత్రపరిశ్రమ : కరోనా కలకలం.. ఐసీయూలో లతా మంగేష్కర్
లతా మంగేష్కర్ మేనకోడలు రచన ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 నవంబర్ లో లతా మంగేష్కర్ వైరల్ చెస్ట్ కంజెస్టిన్ కారణంగాఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు, ఆరోగ్యం దృష్ట్యా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని లతా మంగేష్కర్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఇవాళ రేణూ దేశాయ్ ఆమె కుమారుడు అకీరా నందన్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని సూచనలు చేసారు. ఇక వీరితో పాటు ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్లగణేష్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు తమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు సత్యరాజ్, హీరోయిన్ త్రిష సహా మరికొంతమంది కరోనా బారినపడ్డారు.