యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!

Chakravarthi Kalyan
సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏదో ఒక వల వేసి ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ యువతిని ని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకున్న ఓ యువతిని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు.

ఆ యువతికి క్వికర్ డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నామని మభ్య పెట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీకు జాబ్ కన్ఫామ్ అయిందని మాయమాటలు చెప్పారు. ఉద్యోగం కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పారు. తమ ఖాతాలో లక్ష రూపాయలకు పైగా వేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ చేసేశారు. ఆ తర్వాత ఎంతకూ ఆ ఫోన్ కలవకపోవడంతో ఆ యువతికి మోసం అర్థమైంది. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు  ఫిర్యాదు చేసింది. సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: