తిరుచానూరులో పశువుల దొంగలు హల్చల్ చేస్తున్నారు. నిత్యం రాత్రులు పశువులకు మత్తు మందు ఇచ్చి వాటిని దొంగిలిస్తున్నారు.అయితే తమ పశువులు దొంగతనానికి గురవుతున్నాయని స్థానిక రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో యధేచ్చగా ఈ పశువుల చోరీ కొనసాగుతుంది.తాజగా మూడు పశువులను చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పశువులు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని చెప్తున్నారు. ఇకనైనా పశువులను దొంగిలించే వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.