బ్రేకింగ్: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు... 9 లక్షలకు చేరువ...!
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎలా విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే ఏపీలో కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటికి 8.90 లక్షల పరీక్షలు పూర్తవ్వగా.. ఈ సంఖ్య బుధవారం నాటికి 9 లక్షలు దాటనుంది. దేశంలోనే ఎక్కువ కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఏపీ అరుదైన రికార్డు సాధించింది.
ఇక రోజు కు కేవలం 90 పరీక్షలతో మొదలైన కరోనా పరీక్షలు ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా రోజుకు 30 వేలకు చేరువ అయ్యాయి. ఇదిలా ఉండగా గడచిన 24 గంటల్లో 704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 51 మంది, ఇతర దేశాలకు చెందిన 5మంది కరోనా పాజిటివ్గా నమోదయ్యారు. మరో 258 మంది డిశ్చార్జి అయ్యారు.