ఆ నాలుగో బిగ్ బాస్ ఎవరు...?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ వెళ్లి పార్క్ హయత్ హోటల్ లో కలవడంపై ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి కూడా విమర్శలు చేసారు.
పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యమని ఆయన ఆరోపించారు. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని ఆయన ఆరోపించారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? అని ఆయన నిలదీశారు. మరిన్ని వివరాలు అతి త్వరలో అంటూ ఆయన ట్వీట్ చేసారు. కాగా బిజెపి అధిష్టానం వారిపై సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం.
దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు.
ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?
మరిన్ని వివరాలు అతి త్వరలో... — Vijayasai reddy v (@VSReddy_MP) June 23, 2020