బ్రేకింగ్: తాను తిరిగి ఎన్నికల కమిషనర్ అని రమేషే ప్రకటించుకున్నారు : ఏడీజీ
హైకోర్ట్ తీర్పు రాగానే నిమ్మగడ్డ రమేష్ తనను తాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ప్రకటించుకున్నారు అని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. విజయవాడ కార్యాలయం నుంచి ఆయన సర్క్యులర్ జారీ చేసారని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని తన ఇంటికి వాహనాలు పంపించాలని ఆయన సూచించారని వివరించారు.
ఆయన ఎన్నికల కమీషనర్ గా కొనసాగమని హైకోర్ట్ నేరుగా ఎక్కడా చెప్పలేదు అని శ్రీరాం అన్నారు. కాని రమేష్ కుమార్ కుమార్ మాత్రం బాధ్యతలు చేపట్టినట్టు గా అధికారులకు సర్క్యులర్ విడుదల చేసారని వివరించారు. సుప్రీం కోర్ట్ కి వెళ్ళడానికి హైకోర్ట్ ని అనుమతి అడిగామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.