కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సినీ ప్రముఖుల వీడియోకాన్ఫరెన్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షూటింగ్కు సంబంధించిన అంశంపై వారందరూ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లాక్డౌన్ సడలింపులతో అనేక రంగాల కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ రంగ కార్యకలాపాలు కూడా ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని వారు కోరినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే దేశవ్యాప్తంగా షూటింగ్లకు అనుమతి ఇస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్లో కూడా షూటింగ్స్కు అనుమతి ఇస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా పలువురు సినీ ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే షూటింగ్ సందడి మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.