ఆ కానుక వాళ్లకే.. జగన్ కొత్త రూల్.. మంచిదేనా?
అక్టోబర్ 1 నుంచి ఈ రెండు పథకాలను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపిన సీఎం... వివాహమైన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే ప్రతి 3 నెలలకు ఓసారి లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల వివాహానికి ఆర్ధిక సాయం అందించేందుకు రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలను ప్రారంభించారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ లకు వైఎస్ ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని, ముస్లిం మైనార్టీలకు వైఎస్ ఆర్ షాదీ తోఫా పథకాలను ప్రారంభించారు. వీటికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు.