బాబోయ్.. ఏపీలో ఇందరు లంచగొండులా?
అయితే.. ఈ కాల్ సర్వీసు అందుబాటులోకి తెచ్చాక.. ఇప్పటికి లక్షల మంది కాల్ చేసి ఫిర్యాదులు చేశారు. ఆ లిస్ట్ ఎంత పెద్దగా ఉందంటే.. 2019లో 5114 మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారట. ఆ తర్వాత 2020లో 67,427 మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2021లో 45 వేల990 మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారు. అలాగే 2022లో ఇప్పటి వరకూ 31 వేల419 మంది కాల్స్ చేసి ఫిర్యాదు చేశారట. అంతే కాదు కొత్తగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ ద్వారా 1925 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం కాల్స్ లో 8వేల 842 అవినీతి నిరోధక అంశాలపై ఫిర్యాదులు వస్తే.. మిలిగిన 90వేల 715 మాత్రం ఇతర కాల్స్ గా అధికారులు వెల్లడించారు.