అమ్మాయిలూ.. ఇలాంటి ఖిలాడీలతో జాగ్రత్త?
తాజాగా పెద్దపల్లి జిల్లాలో పెళ్లి పేరుతో ఇద్దరు యువతులను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయమైన ఇద్దరిని ఈ ఖిలాడీ మోసగించాడు. కాకినాడకు చెందిన సూర్య ప్రకాశ్.. ఇద్దరు యువతులను మోసగించాడు. గోదావరిఖనికి చెందిన యువతి వద్ద నుంచి మాయమాటలతో ఏకంగా రూ.23 లక్షలు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన మరో యువతిని కూడా ఇతడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.14 లక్షలు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలూ కాస్త జాగ్రత్త.