అమ్మ: గర్భిణులు ఈ చిట్కాలు పాటించండి..!
ఇక గర్భిణులు మొదటి నెలలో కలకండతో కలిపిన పాలను రోజుకు రెండు పూటలా క్రమం తప్పకుండా తాగాలి. రెండవ నెలలో శతావరి చూర్ణం 10గ్రాముల గోరువెచ్చని పాలలో కలిపి తాగాలి. మూడవ నెలలో పాలను చల్లారిచ్చి ఒక స్పూన్ నెయ్యి, మూడు స్పూన్ల తేనె కలిపి తాగాలి. దీనిని ఎనిమిదవ నెలవరకు అలాగే కొనసాగించాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే నెయ్యి, తేనె సమపాళ్ళలో కలిపి తీసుకుంటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు.. గర్భిణులు నాల్గవ నెలలో పాలలో వెన్న కలుపుకుని తాగాలి. ఐదవ నెలలో మళ్లీ పాలలో నెయ్యి కలుపుకుని తాగాలి. ఆరు, ఏడవ నెలలో మళ్లీ శతావరి చూర్ణంతో కలిపి పాలు తీసుకోవాలి. ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలిపి తీసుకోవాలి. మూడవ నెలనుంచి ఎనిమిదవ నెల వరకు రెండుపూటలా పెద్ద స్పూనుతో సోమఘృతం పాలల్లో కలుపుకుని తీసుకోవాలి. గర్భ స్రావం.. గర్భిణీ స్త్రీలకు ఏడవ నెలనుంచి ఎనిమిదవ నెలలో గర్భ స్రావం జరిగే లక్షణాలు కనుక కనపడితే లోధ్రా మరియు మర్రి చెట్టు యొక్క బంకనుకలిపి చూర్ణంలాగా ఒక్కొక్క గ్రామును కలిపి తేనెతో కలిపి తీసుకుంటే గర్భ స్రావం జరగదని వైద్యులు పేర్కొన్నారు.