కువైట్ లో నిస్సహాయ స్థితిలో 200 మంది అమ్మాయిలు.. వైసీపీ ఎంపీ ట్వీట్

Satvika

బ్రతుకు దెరువు కోసం మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళూ కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పక్క దేశాలలో పని చేస్తూ ఉంటారు. ఈ క్రమమంలో చాలా మంది మహిళలు అరబిక్ దేశమైన కువైట్ లో వంటి దేశాలలో ఎక్కువగా వెళ్తుంటారు. అయితే పక్క దేశాలకు వెళ్లాలంటే వీసాల కోసం మధ్యవర్తులను నమ్ముకుంటారు. అలా వారు చేసే మోసంలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటారు. 

 

కువైట్‌లో చిక్కుకుపోయిన 200 మంది ఆంధ్రప్రదేశ్ యువతులను రక్షించాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాధితులను ఆ చెర నుంచి రక్షించేందుకు దౌత్య సాయం అందించాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జయశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు గురైన దాదాపు 200 మంది యువతులు కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ వద్ద చిక్కుకుపోయారని, వారికి కాపాడాలని కోరారు. 

 

ఈ  సందర్బంగా స్పందించిన ఆయన వారిని తిరిగి దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి బాధిత యువతుల వీడియోను తన ట్వీట్‌కు జోడించారు.బాధిత యువతులు చెప్పిన దాని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి అక్కడి యువతులకు మాయమాటలు చెప్పి కువైట్ పంపిస్తున్నాడు. అక్కడ వీరిని తీసుకున్న ఓ మహిళా వీరిని అందరికి అమ్మేస్తుంటారు. 

 

వారిని రక్షయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఆరోగ్యం కూడా సరిగా లేదని, ఎలాగైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. ఈ విషయం పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: