తారక్ పై పడి ఏడుస్తున్న బాలీవుడ్ మీడియా?

Purushottham Vinay
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  ఎప్పుడూ కూల్ గా ఉంటారు. మరీ కోపం, చిరాకు తెప్పిస్తే తప్ప తారక్ సీరియస్ కావడం ఎప్పుడు జరగదు. అయితే ముంబైలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ఓయ్ అంటూ అరిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా సీరియస్ అవ్వడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని సమాచారం తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీలో లుక్ రివీల్ కాకూడదనే ఆలోచనతో ఫోటోలు తీయవద్దని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే ఫోటోగ్రాఫర్లకు సూచించడం జరిగిందని తెలుస్తోంది. అయితే కొందరు ఆకతాయి ఫోటోగ్రాఫర్లు మాత్రం అత్యుత్సాహంతో తారక్ ఫోటోలు, వీడియోలు తీయడం జూనియర్ ఎన్టీఆర్ కు బాగా చిరాకు తెప్పించిందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హోటల్ కు వెళ్తున్న సమయంలో ఈ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీసినట్లు సమాచారం అందుతోంది.


ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. వార్1 మూవీని మించిపోయేలా వార్2 సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 2025 ఆగష్టు 14వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అలా చేయడంలో తప్పు లేదని నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. సెలబ్రిటీల అనుమతి లేకుండా ఇలా ఫోటోలు తీయడం తప్పేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కోపం తెప్పించారంటే ఆ ఫోటోగ్రాఫర్లు లిమిట్స్ క్రాస్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ బాలీవుడ్ మీడియా గురించి తెలిసిందేగా.. దేన్నైన నెగటివ్ చెయ్యడం అంటే బాలీవుడ్ మీడియాకి సరదా.. దాంతో ఇప్పుడు తారక్ ని కూడా బాలీవుడ్ జనాలకి నెగటివ్ గా చూపిస్తున్నారు. తారక్ పై ఏడుస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. దేవర  సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలో మొదలుకానున్నాయని తెలుస్తోంది.ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాడని ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: