షర్మిలకు ఓటమి భయం పట్టుకుందా..?

Pulgam Srinivas
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు అంతా సిద్ధం అయ్యింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో పోటీలో ఉన్న నేతల్లో గెలుపు అవకాశాలు లేని వారు గెలుపు అవకాశాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే , గెలుపు అవకాశాలు ఉన్న వారు మెజారిటీ భారీగా తెచ్చుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఇలా ఉంటే వైఎస్ షర్మిల కొంత కాలం క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో చురుగ్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు స్టార్ట్ కాగానే ఇక్కడికి వచ్చిన విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా ఈమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్సభ అభ్యర్థిగా పోటీలోకి దిగింది. ఇక కూటమి అభ్యర్థిగా కడప నుండి చెడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీలోకి దిగగా , వైసీపీ పార్టీ నుండి అవినాష్ రెడ్డి పోటీలోకి దిగాడు. ఈమెకు టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి భూపేష్ రెడ్డి తో పెద్దగా పోటీ లేకపోయినప్పటికీ అవినాష్ రెడ్డి తో మాత్రం భారీ పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంత మంది షర్మిల కు ఓటమి భయం పట్టుకున్నట్టు ఉంది , అందుకే ఆమె ప్రచారాలు తుది దశకు చేరుకున్న సమయంలో రాహుల్ గాంధీని కూడా రంగంలోకి దించబోతుంది అని మాట్లాడుకుంటున్నారు.

రాహుల్ గాంధీ 11 వ తేదీన ఈమె తరపున ప్రచారం చేయనున్నాడు. ఇకపోతే తాజాగా ఈమె వైయస్ జగన్ పై కూడా భారీగానే ప్రేమను కురిపించింది. ఇన్ని రోజుల పాటు ఆయనను ద్వేషించిన ఈమె తాజాగా జగన్ పై అత్యంత ప్రేమను కురిపించింది . ఇక తాజాగా అందుకు సంబంధించిన ఆడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. అందులో షర్మిల రాయలసీమ కుటుంబాల్లో ఆడబిడ్డ అడిగితే ఏ అన్న కూడా ఇవ్వను అనడు. నేను జగన్ ను గెలుపును అడుగుతున్నాను. కచ్చితంగా అది నాకు ఇస్తాడు అంటూ ఆమె అందులో అంది. మరి ఇదంతా ఎన్నికల కోసం షర్మిల ఆడుతున్న సెంటిమెంట్ గేమ్ హా లేక నిజంగానే అన్నపై ప్రేమ పుట్టుకొచ్చిందా అనే సందేహాలు కూడా ఈ ఆడియో విన్నవారికి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: