కావల్సిన పదార్థాలు:
మైదా: 2 కప్పులు
పంచదార: 2కప్పులు
యాలకులు: 2
నెయ్యి: 2 టేబుల్ స్పూన్
గుడ్లు: 2
నూనె: వేయించడానికి సరిపడ
ఉప్పు: చిటికెడు
వంటసోడా: చిటికెడు
సోంపు: ఒక స్పూను
బొంబాయి రవ్వ: 2 టీస్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా పంచదారను పొడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండిని తీసుకుని అందులో చక్కెర, గుడ్లు, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి, ఉప్పు వంటసోడా, సోంపు, రవ్వను వేసి సరిపడినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని నాలుగు బాగాలుగా చేసి, ఉండచుట్టుకొని చపాతీ పీట మీద వేసి పిండిని ఒక అంగు ళం మందంగా ఒత్తుకోవాలి.
తరువాత చాకు తీసుకుని డైమండ్ లేదా నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న డైమండ్స్ ను కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి వారం పది రోజుల వరకు నిలవ వుంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: