సెలెక్టర్ల కాళ్లు పట్టుకోలేదు.. అందుకే తీసుకోలేదు : గంభీర్

praveen
గౌతమ్ గంభీర్.. ఈయన గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతొ అందరికి సుపరిచితుడుగా ఎంతో మందికి ఫేవరెట్ క్రికెటర్ గా మారిపోయాడు. టీమిండియా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ వరల్డ్ కప్ లలో భారత జట్టు గెలవడానికి ఇక అద్భుతమైన ఆరంభాలు అందించి ఇక సూపర్ పర్ఫామెన్స్ చేసింది గౌతమ్ గంభీర్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

 ఓపెనర్ గా భారత జట్టుకి దాదాపు దశాబ్దానర కలం పాటు సేవలు అందించిన గౌతమ్ గంభీర్.. ఇక ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. తన బ్యాటింగ్ తో  అటు భారత క్రికెట్ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే క్రికెట్ తో ఎలా అయితే గౌతమ్ గంభీర్  ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడో.. వివాదాలతోను ఇలాగే ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేవాడు గౌతమ్ గంభీర్. ఇక ఏది ఉన్న ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గంభీర్ ఇక అప్పుడప్పుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలతో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటాడు.

 అయితే ఇటీవలే మరోసారి ఈ మాజీ ప్లేయర్ ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అండర్ 14 క్రికెట్ ఆడే సమయంలో సెలెక్టర్ కాళ్లు మొక్కలేదు అనే కారణంతో తనను జట్టులోకి ఎంపిక చేయలేదు అంటూ భారత మాజీ క్రికెటర్ గంభీర్ తెలిపాడు. తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ఒక ఈవెంట్లో గుర్తు చేసుకున్నాడు. కెరియర్ లో ఎదగాలని ఓ సమయంలో అనుకున్నా. ఎవరి కాళ్లు పట్టుకోకూడదని.. ఎవరిని నా కాళ్లు పట్టుకొనివ్వద్దని నిర్ణయించుకున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటా అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: