ఓటీటీ లోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..??
ఈ థ్రిల్లర్ మూవీ మే 10న థియేటర్లలో రిలీజైంది. రెండు వారాలు కూడా గడవకముందే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 23 నుంచి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్కు రెడీ అయ్యిందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సుప్రిత సత్యనారాయణ్ హీరోయిన్గా నటించగా.. భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. వి అజయ్ నాగ్ ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ కన్నడ నవల ఆధారంగా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించాడు వి అజయ్ నాగ్.ఇక ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ భగత్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఆరంభం చిత్రంలో మిగిల్ పాత్రలో మంచి నటన కనబరిచి.. మరోసారి అందరి ప్రశంసలు పొందాడు. టీజర్, ట్రైలర్లతో సినిమా మీద అంచనాలు పెంచారు. ఇక విడుదలయ్యాక కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇకపోతే ఈ సినిమా అంతా ఓ కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే అంశం చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలో అతడికి దొరికిన ఓ డైరీలో కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుంటాడు. మిగిల్ ఎంతో చిత్రంగా జైలు నుంచి బయటపడతాడు. మరి పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు అన్నదే సినిమా.