వీడియో : ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఎంత ఘోరం జరిగేదో?

praveen
ఈ భూమ్మీద నూకలు తినే బాకీ ఉండాలే కానీ ఎలాంటి ప్రమాదంలో నుంచి అయినా సరే బయటపడతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేసిన.. ఇక వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే దాదాపుగా ప్రాణాలు పోయాయి అని అనుకుంటున్న సమయంలో.. రెప్పపాటు కాలంలో చివరికి చిన్న గాయం కూడా కాకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడటం చేస్తూ ఉంటారు ఎంతోమంది.

 అయితే ఇలాంటి తరహా ఘటన ఏదైనా జరిగింది అంటే చాలు సోషల్ మీడియాలోకి వైరల్ గా మారిపోయి ప్రపంచ వ్యాప్తంగా పాకిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో మంది మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం లేదంటే.. అతివేగంతో నిబంధనలు విరుద్ధంగా డ్రైవింగ్ చేసి ఎంతోమంది అభం శుభం తెలియని వారి పాలిట యమకింకరులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది..

 ఇక్కడ ఒక కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక బాలుడి ప్రాణం పోయేది. కానీ ఏకంగా అతనికి భూమి మీద నూకలు తినే బాకీ ఉన్నట్టుంది రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడగలిగాడు. అతని తల్లి సమయస్ఫూర్తి చివరికి అతన్ని కాపాడింది అని చెప్పాలి. రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇక వాటి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నుండి ఒక మహిళ ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఒక వైపు నుండి కారు డ్రైవర్ కారును సడన్గా వెనక్కి పోనిచ్చాడు. దీంతో ఆ కారు దూసుకువెళ్లి వెనకాల ఉన్న కార్ ను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో పిల్లోడు కార్ వెనకాలే ఉన్నాడు. క్షణాల్లో కార్ టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడు. గమనించిన తల్లి ఏకంగా రెప్పపాటు కాలంలో అతన్ని పక్కకు లాగేయడంతో చివరికి ప్రాణాలతో బయటపడగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: