వైరల్ : రిబ్బన్ కట్ చేయగానే.. కూలిపోయిన వంతెన?

praveen
సాధారణంగా ప్రజలకు అవసరమైనప్పుడు కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాధికారులు వంతెనను నిర్మించటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వంతెనలు నిర్మించడం ద్వారా  ఏవైనా కాలువలు దాచడానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే ఇక ప్రభుత్వం ఇలాంటి వంతెనలు ఏదైనా నిర్మించింది అంటే చాలు ఇక రాజకీయ నాయకులు అక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసి ఒక పెద్ద సభ నిర్వహించి అక్కడ ప్రసంగాలు ఇచ్చి వంతెనను ప్రారంభించటం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా వంతెన ప్రారంభం సమయం లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. కొన్ని కొన్ని సార్లు వంతెన నిర్మించిన సమయంలో కొన్ని రోజులకే ఆ వంతెన కూలి పోవడం లేదా డ్యామేజ్ కావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం చాలా విచిత్రమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఆ వంతెన రిబ్బన్ కట్ చేశారో లేదో క్షణాల వ్యవధిలో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఓ బ్రిడ్జ్ రిబ్బన్ కట్ చేస్తుండగానే కుప్పకూలిపోయింది.


 వర్షాకాలం కావడంతో ఇక నది దాటేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యను తీర్చేందుకు ఒక చిన్న బ్రిడ్జి నిర్మించారు.  ఇక ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వాధికారి చీఫ్ గెస్ట్ గా ఇక్కడికి వచ్చారు.  అయితే ఇలా మహిళా అధికారి వంతెన ప్రారంభించడానికి రిబ్బన్ కట్ చేయగానే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన అధికారులు ముందుగా ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు లాగేసారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం రోజే కూలిపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలకు దుమ్మేస్తూ పోస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: