పానిపూరి వ్యక్తి ఆలోచనకు ఫిదా అవ్వాల్సిందే..వైరల్..

Satvika
సాదారణంగా పానిపూరి అంటే అందరికి ఇష్టం ఉంటుంది.. పానిలో వేస్తున్న ఆ మసాలా ఫ్లెవర్స్ అందరిని ఆకట్టుకోవడం తో చాలా మంది వీటిని తినడానికి ఇష్ట పడతారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పేరుతో పిలుస్తారు.. ఎక్కడైనా రుచి ఒక్కటే అని చెప్పాలి.. విషయాన్నికొస్తే.. ఓ పానిపూరి నిర్వాహకుడు విచిత్రమైన ఆలోచన చేశాడు. అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో అతను ఇప్పుడు ఒక సెలెబ్రేటి అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరత ఎక్కువగా ఉండటం తో అతడు ఈ ఆలోచన చేసాడని చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

 
ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. నీటిని పొదుపు చేసేందుకు, నీటిని ఎలా పొదుపు చేయాలనే దానిపై ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ను అమలు చేస్తున్నాయి. నీటి పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. నీటిని పొదుపు చేయడం గురించి సోషల్ మీడియా లో విభిన్న పోకడలు, సందేశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పానీ పూరీ అమ్మకందారుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాడు.


ప్రత్యేక పద్ధతి లో నీటిని పొదుపు చేయాలని ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.. ఈ పోస్టర్‌ని చూస్తే, పానీ పూరీ అమ్మకందారు నీటిని పొదుపు చేయమని సందేశం ఇచ్చిన తీరును మీరు మెచ్చుకుంటారు. అయితే, ఈ పానీపూరి విక్రయదారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని దుకాణం ఎక్కడ అన్నది మాత్రం సమాచారం లేదు. కానీ నీటి పొదుపుపై ఇచ్చిన ప్రత్యేక సందేశం మాత్రం ప్రజల హృదయాల ను గెలుచుకుంది.. ఈ విషయం అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తాని కి అతడి ఆలోచన అందరినీ ఆకర్షించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: