బుల్లి పిట్ట: Xiaoma నుంచి ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1200 KM..ధర ఎంతంటే..?

Divya
ప్రస్తుతం గ్లోబల్ ఆటో మార్కెట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. దేశంలోనే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే చాలా సంస్థలు కూడ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపే మక్కువ చూపుతున్నారు. ఇటీవలే చైనాలో చిన్న ఎలక్ట్రిక్ కారుగా వచ్చిన xiaoma బ్రాండెడ్ నుంచి కొద్ది రోజుల క్రితం ఒక కారుని లాంచ్ చేశారు. ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే చాలు 1200 KM వరకు నడవగలదట.

అయితే దీని ధర సుమారుగా 30 నుంచి 50 యుగాండ్ల వరకు ఉంటుందట.మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.3.58 లక్షల నుంచి 6 లక్షల లోపు  ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేయడానికి 20KW మోటర్ ఉంటుందట. ఇది లీథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీగా ఉన్నట్లు తెలుపుతున్నారు. అయితే భద్రతా కోసం డ్రైవర్ వైపు మాత్రమే ఒక ఎయిర్ బ్యాగ్ ని అమర్చినట్లుగా తెలుస్తోంది. ఈ కారు కేవలం మూడు డోర్లతో వస్తుందట. అలాగే ఈ కారులో యాంటీ లాక్ బ్రేక్ సిస్టం వంటి ఫీచర్ కూడా కలిగి ఉన్నది. ఇవేకాకుండా మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయట.

గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఆటో షోలో బెస్ట్ న్యూ షావోమియాను ప్రవేశపెట్టారు. ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉన్నది. ఈ కారు ఏరో డైనమిక్ డిజైన్ కలిగి ఉండడం వల్ల ఈ కారు వేగంగా వెళ్ళినా కూడా స్థిరంగానే కలిగి ఉంటుంది. ఈ కారుకు నాలుగు వీల్స్ కలిగి ఉన్నాయి. ఇది ఇండియాలోనే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం చెప్పలేదు. కానీ ప్రస్తుతం అయితే ఈ షావోమీ ఎలక్ట్రికల్ కారు... చైనాలో మాత్రమే అమ్ముతున్నారట. అక్కడ విపరీతంగా ఈ కారు సెల్స్ జరుగుతున్నట్లు సమాచారం అందుకే ఈ కారును మార్కెట్లోకి కూడా తీసుకురావాలని భావిస్తున్నారట ఈ కంపెనీ. ఈ కారు వల్ల ట్రాఫిక్కు కూడా సులభంగా తగ్గిపోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: