సఫారిలదే తొలి టెస్ట్.. రెండో ఇన్నింగ్స్ సీన్ మారలా..!

shami
భారత్ సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న 3 టెస్టుల సీరీస్ లో భాగంగా కేప్ టౌన్ లో తొలి టెస్ట్ 4వ రోజే ఆట ముగిసిపోయింది. రెండు ఇన్నింగ్స్ లో భారత జట్టు బ్యాట్స్ ఘోర వైఫల్యం చెందగా 209 పరుగులు ఛేధిస్తే విజయం సాధించే మ్యాచ్ సైతం చేతులెత్తేశారు. భీకరమైన ఫాంలో ఉన్న బ్యాట్స్ మన్ కూడా క్యూ కట్టి మరి పెవిలియన్ బాట పట్టారు.


తొలి టెస్ట్ సత్తా చాటుతారనుకున్న అభిమానుల అంచనాలను తారు మారు చేస్తూ ఫలితం మరి ఘోరంగా వచ్చేలా చేశారు. తొలిత టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయగా 286 పరుగులకే అవుట్ అయ్యింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ లో దుమ్ముదులిపిన ఇండియా సౌతాఫ్రికా జట్టుని 130 పరుగులకే ఆలౌట్ చేశారు.


ఇక 209 పరుగులు చేస్తే విజయం సాధించే మ్యాచ్ ను ఇండియా చేజార్చుకుంది. కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో బౌలర్ అశ్విన్ అత్యధిక స్కోర్ 37 పరుగులు చేయడం విశేషం. ఫైనల్ గా ఇండియా 72 పరుగుల తేడాతో సఫారిలపై ఓటమి పాలైంది. 3 టెస్టుల సీరీస్ లో 1-0తో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: