రోహిత్, కోహ్లీ లేకపోతే ఏంటి.. కుర్రాళ్ళు అది ప్రూవ్ చేశారుగా?

praveen
టీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవలేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఎంతోమంది ప్రతిభగల యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తూ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అయితే టీం ఇండియాకు తామే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని కూడా తమ ఆట తీరుతో ఎప్పుడూ నిరూపిస్తూ ఉంటారు యంగ్ ప్లేయర్లు. ఇక ఈ మధ్యకాలంలో అయితే అటు టీమ్ ఇండియాలో ఛాన్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఏకంగా ఎవరికి వారేబెస్ట్ అన్న విధంగా ఆట తీరు కనబరుస్తూ ఉండడంతో టీమ్ ఇండియాలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనే విషయం కూడా సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే టీమ్ ఇండియా ఫ్యూచర్ టీం ఎంత బలంగా ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇటీవల ఒక విజయం నిలిచింది. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బరిలోకి దిగి టైటిల్ విజేతగా నిలిచింది. పొట్టి ఫార్మాట్లో దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇక ఈ రికార్డును అందుకోగలిగింది టీమిండియా. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రవీంద్ర జడేజా లాంటి సీనియర్ ప్లేయర్లు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఈ సీనియర్ ప్లేయర్లు లేకుండా టీమిండియా టి20 జట్టుఎలా ఉంటుందో అని అందరూ అనుకున్నారు.

 కానీ సీనియర్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ అటు టీమ్ ఇండియా జట్టు మాత్రం ఎంతో బలంగా ఉంటుంది అన్న విషయం ఇటీవలే కుర్రాళ్ళ ప్రదర్శన చూస్తే అర్థమవుతుంది. ఇటీవల జింబాబ్వే పర్యటనకు గిల్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇండియా అటు పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ 4- 1 తేడాతో చేసి దక్కించుకుంది. తొలి t20 మ్యాచ్ లో తడబడిన ఆ తర్వాత పుంజుకొని ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆదిపత్యం చెలాయించింది. హార్దిక్ పాండ్యా, బుమ్రా, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు లేకపోయినా గిల్ నేతృత్వంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో రోహిత్ విరాట్ లాంటి సీనియర్లు లేకపోయినా టీమ్ ఇండియాకు తిరుగులేదు అని ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: