ఎగ్జామ్ టెన్షన్.. నిద్ర రాకుండా ఆ టాబ్లెట్ వేసుకుంది.. చివరికి?

praveen
సాధారణంగా పరీక్షలు వచ్చాయి అంటే చాలు విద్యార్థుల్లో ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. పరీక్షల్లో పాస్ అవుతామో లేదో ఒకవేళ పాస్ అయిన ఇక ఎక్కువ మార్కులు వస్తాయో లేదో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక కొంతమంది విద్యార్థులు అయితే క్లాస్ ఫస్ట్ రావడానికి తెగ కష్టపడి పోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎగ్జామ్స్ వచ్చాయి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో ఎగ్జామ్స్ రాగానే అటు పుస్తకం పట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఎగ్జామ్ కోసం చదువుతుంటే మనకు తెలియకుండానే నిద్రలో మునిగిపోతూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎగ్జామ్స్ సమయంలో నిద్ర రావడం కారణంగా విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఇలా ఎగ్జామ్స్ కోసం చదువుతున్న సమయంలో నిద్ర రాకుండా ఉండేందుకు కొంతమంది విద్యార్థులు ఏకంగా యాంటీ స్లీపింగ్ మాత్రలు కూడా వేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇలాంటివి వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్న విద్యార్థులు మాత్రం ఇలాంటి యాంటీ స్లీపింగ్ టాబ్లెట్స్ మరింత ఎక్కువగా వాడేస్తూ ఉన్నారు.

 అయితే ఇక్కడ ఏకంగా ఇలాంటి టాబ్లెట్స్ వేసుకొని ఒక విద్యార్థి చివరికి ఆసుపత్రి పాలు అయింది. పరీక్షలకు భయపడి మేలుకొని ఉండడానికి లక్నో కి చెందిన పదవ తరగతి విద్యార్థిని యాంటీ స్లీపింగ్ మాత్రలు తీసుకుంది.ఇక మెడిసిన్ ను అధిక మోతాదులో  వేసుకోవడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది. దీంతో సదరు విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్పించగా చివరికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలామంది విద్యార్థులు నిద్ర రాకుండా ఉండేందుకు టీ కాఫీలాంటివి కూడా అధికంగా తాగుతున్నారని.. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలపై ఒక అన్నేసి ఉంచాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: