నేను టీమిండియాలో చోటు కోల్పోవడానికి.. ఆ తప్పుడు ప్రచారమే కారణం?

praveen
వరుణ్ చక్రవర్తి.. ఈ పేరు ఈ మధ్యకాలంలో టీమిండియా క్రికెట్లో వినిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం ఇక ఇతని పేరు ఇండియన్ క్రికెట్ లో మారుమోగిపోయింది. ఎందుకంటే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన స్పిన్ బౌలింగ్ తో ఎన్నోసార్లు మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అంతేకాదు మిస్టీరియస్ స్పిన్నర్ అనే ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టీమిండియాలో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. ఇక భారత జట్టు తరఫున కూడా అతని ప్రదర్శనతో పరవాలేదు అనిపించాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అతని ఆట తీరు చూస్తే టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేలాగే కనిపించాడు.

 కానీ ఊహించని రీతిలో ప్రస్తుతం అతను భారత జట్టులో చోటు కోల్పోయాడు. కనీసం అతని పేరు కూడా ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ ప్రస్తావనకు కూడా రావడం లేదు అని చెప్పాలి. భారత సెలెక్టర్లు కూడా వరుణ్ చక్రవర్తిని టీమిండియాలోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. ఇలా సముద్రపు అలలా దూసుకు వచ్చి అంతే వేగంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఈ మిస్టీరియస్ స్పిన్నర్. అయితే తనకు టీమిండియాలో చోటు కోల్పోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ యంగ్ స్పిన్నర్.

 2021 t20 వరల్డ్ కప్ సమయంలో మూడు మ్యాచ్లు ఆడిన వరుణ్ చక్రవర్తి తర్వాత గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇక తన గాయం పై ఎన్నో రకాల ప్రచారాలు తెరమీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే కొందరు తన గాయం పై తప్పుడు ప్రచారం చేయడం వల్లే తాను టీమిండియాకు దూరమైనట్లు వరుణ్ చక్రవర్తి ఆరోపించాడు. తనకు పెద్దగా గాయం ఏమీ కాలేదని..  కానీ కొంతమంది పనిగట్టుకొని తనకు తీవ్రమైన గాయం అయింది అని ప్రచారం చేశారు అంటూ ఈ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. కాక గత కొన్ని ఐపీఎల్ సీజన్స్ నుంచి కూడా కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ   జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు వరుణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: