
వారెవ్వా.. స్మృతి మందానకు అరుదైన అవార్డు?
అయితే ఇండియాలో క్రికెట్ కి క్రేజ్ ఉంది. కానీ కేవలం మెన్స్ క్రికెట్ కి మాత్రమే క్రేజ్ ఉంది అన్న విధంగా మొన్నటి వరకు పరిస్థితులు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో బీసీసీఐ మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహించడంతో పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇలా ఏకంగా మెన్స్ క్రికెట్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఉమెన్ క్రికెటర్లలో స్మృతి మందాన కూడా ఒకరు అని చెప్పాలి ప్రస్తుతం టీమిండియా మహిళా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నారు ఆమె.
సాదరణంగా క్రికెటర్లు తమ ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంటారు. అయితే స్మృతి మందాన ఆట తీరుతోనే కాదు అందం అభినయంతో కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఎంతోమంది కుర్ర కారు మతి పోగొట్టింది. అయితే స్మృతి మందాన ఇటీవల బిసిసిఐ ప్రకటించిన అవార్డులలో ఎన్నో అవార్తులను సొంతం చేసుకుంది అని చెప్పాలి. బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా వరుసగా రెండుసార్లు నిలిచింది స్మృతి మందన 2020 - 21, 2021-22 సీజన్ లలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు బీసీసీ ఆమెకు అవార్డును బహూకరించింది. టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా ఇలా రెండు సీజన్ల పాటు ఈ అవార్డును అందుకుంది.