ఈసారి ఐపీఎల్ టైటిల్.. ఆ జట్టే గెలుస్తుంది : ఏబిడి

praveen
ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. ఈ రెండు టీమ్స్ కూడా ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఛాంపియన్ టీమ్స్ కి సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఈ రెండు టీమ్స్ తో సమానంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి.

 2008లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే 17వ ఐపీఎల్ సీజన్ వరకు ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈసాల కప్ నమ్ దే అనే నినాదంతో  అభిమానులు అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది. అయితే జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉంటారు. దీంతో ఇక ఈసారి కప్పు గెలవడం ఖాయం అని ప్రతిసారి కూడా అటు ఆ జట్టు అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ ఐపీఎల్ టైటిల్  గెలవడం ఈ జట్టుకు కలగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే 2024 ఐపిఎల్ సీజన్ లో అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారు. ఇదే విషయం గురించి ఆ జట్టు మాజీ ఆటగాడు సౌత్ ఆఫ్రికా దిగ్గజాం ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో మోస్ట్ ఫేవరెట్ ఐపిఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్సిబి తప్పకుండా విజేత నిలుస్తుంది అంటూ అంచనా వేశాడు. ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోవడంతో rcb అన్ని రంగాల్లో కూడా బలంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఎబి డివిలియర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: