ప్రియుడితో ఆ పని చేస్తూ దొరికిన భార్య.. చివరికి భర్త ప్రాణం పోయింది?

praveen
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణమైన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. బంధాలకు బంధుత్వాలకు కాస్తైన విలువ ఇవ్వని మనుషులు క్షణకాల సుఖం కోసం చేయకూడని నిజమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 ఇలాంటి ఆలోచన తీరుతో ఏకంగా పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఇక కలకాలం కష్టసుఖాల్లో తోడు ఉంటాము అని ప్రమాణం చేసిన వారే.. చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత కూడా జనాల తీరులో అస్సలు మార్పు రావడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వచ్చి ఇక భర్తతో కలిసి స్థిరపడిన ఒక మహిళ పరాయి వ్యక్తితో రాసలీలలు నడిపిస్తూ ఇక ప్రియుడితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.

 సత్య సాయి జిల్లాలో నివాసముండే వెంకటరమణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భార్య నందిని ఆమె ప్రేమికుడుతో కలిసి భర్త  తలపై కొట్టి హత్య చేసిందని పోలీసు విచారణలో తేలింది. భర్త ఆంధ్రకు వెళ్లడంతో ప్రియుడుని ఇంటికి పిలిపించుకుంది నందిని. అయితే ఇక భర్త లేడు అని తెలిసి డోర్ లాక్ చేయకుండానే  రాసలీలల్లో మునిగిపోయింది. ఇక అంతలో అకస్మాత్తుగా భర్త ఇంటికి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రియుడుతో భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. భార్యను చితకబాదాడు. ఈ క్రమంలోనే ఇక నందిని ప్రియుడు సతీష్ తో కలిసి భర్తను కింద పడేసి తలపై బండరాయి వేసి హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న పెరట్లో పడేసి సహజ వరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: