కోహ్లీతో గొడవపడిన క్రికెటర్ పై.. 20 నెలల నిషేధం?
ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అవుట్ అయిన ప్రతిసారి కూడా మ్యాంగోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ అభిమానులకు ఆగ్రహం తెప్పించి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇతని టార్గెట్ చేస్తూ కోహ్లీ అభిమానులు ఎంతలా ట్రోల్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వరల్డ్ కప్ సమయంలో మాత్రం విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకుని.. వారిద్దరి మధ్య ఉన్న వివాదానికి స్వస్తి పలికాడు అన్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ అభిమానులు కూడా శాంతించారు. ఇక ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ ఆఫ్గనిస్తాన్ బౌలర్.
అయితే ఇప్పుడు నవీన్ ఇలా వార్తల్లో నిలవడానికి కారణం ఏంటో తెలుసా అతనిపై దాదాపు 20 నెలల పాటు నిషేధం పడటమే. నవీన్ ఉల్ హక్ పై ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు 20 నెలల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. షార్జా వారియర్స్ తరఫున అతను తొలి సీజన్ ఆడి 11 వికెట్లు తీశాడు. అయితే సదరు ఫ్రాంచైజీ మరో ఏడాది కాంట్రాక్టును పొడిగించాలని నిర్ణయించుకోక.. అతను సంతకం చేసేందుకు ససేమిరా అన్నాడు. ఈ క్రమంలోనే నిబంధనల మేరకు ఇలా అతనిపై 20 నెలల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు. కాగా ఇటీవల వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే 24 ఏళ్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.