ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని.. వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రోహిత్ ఫామ్ అటు వరల్డ్ కప్ లో టీం ఇండియాకు ఎంతగానో కలిసి వస్తుంది. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎంతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నేట్టేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ కూడా మంచి ఆరంభాలు అందిస్తున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ అదిరిపోయే ప్రదర్శనతో భారత జట్టు కూడా వరుస విజయాలు సాధిస్తుంది. మరోవైపు కెప్టెన్సీ వ్యూహాలతో కూడా తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు.


 ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యూహాలతో ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో కూడా ఆరు విజయాలను అందించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైన సమయంలో రోహిత్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 87 పరుగులు చేసి రాణించాడు అని చెప్పాలి. అతను 87 పరుగులు చేయడంతోనే ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అయితే ఇలా మంచి ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి.


 ఈ అవార్డుతో ఒక ఆరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్ హిస్టరీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 36 ఏళ్ల 183 రోజుల వయసులో ఈ అవార్డును అందుకున్నాడు హిట్ మ్యాన్. అయితే ఒకే వరల్డ్ కప్ లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత ఆటగాడిగాను అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు వన్డే క్రికెట్ లో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. కాగా ఇంగ్లాండ్ జట్టుతో 100 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఇక సెమి ఫైనల్లో బెర్త్ ను ఖాయం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: