ఇంగ్లాండ్ ఇక ఇంటికేనా.. సెమీస్ అవకాశాలు లేనట్లేనా?

praveen
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా డిపెండ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండు ప్రస్థానం ముగిసినట్లేనా.. దారుణమైన ప్రదర్శనతో ఇక ఒక పీడకల ఇంగ్లాండ్కు ఈ వరల్డ్ కప్ మిగిలిపోబోతుందా.. సెమీఫైనల్కు తప్పకుండా చేరుతుంది అని అంచనాలతో బరిలోకి దిగిన జట్టు.. లీగ్ మ్యాచ్లతో సరిపెట్టుకొని ఇంటిబాట పడుతుందా.. ఇప్పటికే వరుస ఓటములతో పరువు పోగొట్టుకున్న ఇంగ్లాండు టీం.. ఇక మరికొన్ని ఓటములతో  దారుణ ప్రదర్శన చేస్తుందా.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.


 బజ్ బాల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు. ఇదే కాన్సెప్ట్ తో ద్వైపాక్షిక సిరీస్లలో సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జట్టును పాటిష్టంగా మార్చేందుకు బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడు తీసుకున్న రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి మరీ జట్టులో చేర్చుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇలా వరల్డ్ కప్ లో గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అటు 2023 వరల్డ్ కప్ మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు మాత్రం పీడ కలలాగే మిగిలిపోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.



 పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఇంగ్లీష్ టీం ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం దాదాపు ఇంటి దారి పట్టినట్లే. అయితే ఇప్పటికే సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఒకవేళ భారత్తో విజయం సాధించిన భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అడపాదడపా  విజయం సాధించిన ఇక ఇంగ్లాండ్ కు ఇంటి బాట పట్టే పరిస్థితిలే ఏర్పడతాయి. అయితే బట్లర్ సేన మిగతా నాలుగు మ్యాచ్లు గెలిచిన.. ఇతర జట్ల ఫలితాలపైనే ఆ టీం సెమీఫైనల్ తలరాత ఆధారపడి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: