సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. భారత్ కు ఇదే తొలిసారి?
కానీ ఊహించని రీతిలో టీమ్ ఇండియా ఐదో టి20 మ్యాచ్లో దారుణ ఓటమి చవిచూసింది. దీంతో అప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన వెస్టిండీస్ మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇలా సిరీస్ గెలుపు కోసం పోరాడినప్పటికీ టీమ్ ఇండియాకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సిరీస్ కోల్పోవడం ద్వారా అటు టీమ్ ఇండియా ఎన్నో చెత్త రికార్డులను కూడా మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఐదు టి20 మ్యాచ్ ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ 5 సార్లు అడగా.. మూడింటిలో గెలిచి.. ఒక సిరీస్ ను సమం చేసింది. ఇక ఏ ఫార్మాట్లో అయినా అటు టీమిండియా వెస్టిండీస్ పై సిరీస్ ఓడిపోవడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదని ఇదే ఆటతీరును కొనసాగిస్తే. ఇక ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడం కూడా కష్టమే అంటూ ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై ప్రశంసలు గుర్తించిన మాజీ ప్లేయర్లు ఇక ఇప్పుడు అతని వ్యూహాలు సరిగ్గా లేవు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.