ఇండియాతో మ్యాచ్లో.. మనకు ఎవరు సపోర్ట్ చేయరు.. పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న హాట్ ఫేవరెట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోరు అక్టోబర్ 14వ తేదీన జరగబోతుంది అని చెప్పాలి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ.. ఇక భద్రతా కారణాల దృశ్య మ్యాచ్ షెడ్యూల్ ని 14 వ తేదీకి మారుస్తూ నిర్ణయంతీసుకున్నారు.


 ఇక ఈ హాట్ ఫేవరెట్ పోరు కోసం అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ చిరకాల ప్రత్యర్ధుల సమరం ఈసారి ఏకంగా భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో మ్యాచ్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అటు ఇండియా వేదికగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించి పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వేదికగా భారత్తో జరిగే మ్యాచ్కు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి అంటూ కామెంట్ చేశాడు షాదాబ్ ఖాన్.


 ఇండియాలో ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి మద్దతు లభించదు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లందరూ మానసికంగా మరింత బలంగా ఉండాలి. మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో అంత తేలికగా మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం అంటూ షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. టీమిండియా పై విజయం సాధించడంతోపాటు.. వరల్డ్ కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విజయం ఇంకేమీ ఉండదు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే మనకు ఎలాంటి ఆరంభం లభించింది ఎలా ముందుకు సాగుతున్నాం అన్న విషయం పైనే అంత ఆధారపడి ఉంటుంది అంటూ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: