అతన్ని వదులుకున్నందుకు.. ఏం బాధపడట్లేదు : KKR

praveen
గత కొంతకాలం నుంచి ఫార్మాట్ తో సంబంధం లేకుండా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్. జట్టు ఓపెనర్గా బరీలోకి దిగుతూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. కేవలం రోజుల వ్యవధిలోనే సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో సైతం ఇక ఇలాంటి ప్రదర్శన చేస్తూ తన హవా నడిపిస్తూ ఉన్నాడు శుభమన్ గిల్. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శుభమన్ గిల్ ప్రదర్శన చూసిన తర్వాత అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వదులుకొని తప్పు చేసింది అంటూ ఎంతో మంది అభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. అతను జట్టులో ఉండి ఉంటే ఎంతో ఉపయోగపడేవాడు అంటూ జట్టు యాజమాన్యం నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని వేలంలోకి వదిలేయడంతో ఇక గుజరాత్ జట్టు అతని కోసం పోటీపడి మరి జట్టులోకి తీసుకుంది.



 అయితే శుభమన్ గిల్ లాంటి ఆటగాడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయడంపై ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ ను రిటైన్ చేసుకున్నందుకు తాము బాధపడట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ మైసూర్. 2022 సీజన్ నుంచి గుజరాత్కు ఆడుతున్న గిల్.. అంతకు ముందు కేకేఆర్ కు ఆడాడు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే రూల్ ఉండడంతో చివరికి గిల్  ను వదులుకోక తప్పలేదు అంటూ వెంకీ మైసూర్ తెలిపాడు. గతంలో తమ టీం లో ఆడిన ప్లేయర్లు వేరే టీంలో బాగా ఆడితే తమకు హ్యాపీగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: