మూడో వన్డే మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ సెంచరీ?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అత్యుత్తమమైన  ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉండడమే కాదు వరుసగా సెంచరీలతో చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. మొన్నటి వరకు దాదాపు మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ మళ్లీ మునుపటి పామును అందుకొని ఇక రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే గత ఏడాది ఇక మూడు ఫార్మాట్లలో కూడా సెంచరీ చేసి తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇక మొన్నటికి మొన్న కొత్త ఏడాదిలో కూడా మరో సెంచరీ తో చెలరేగి రికార్డుల  వేటను ప్రారంభించాడు అని చెప్పాలి. శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే శ్రీలంకలో జరుగుతున్న వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు నేడు జరగబోయే మూడో వన్డే మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది అని చెప్పాలి.

 అయితే మూడో వన్డే మ్యాచ్లో కూడా అటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అంటూ భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. మూడో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 30 పరుగుల స్కోర్ చేశాడు అంటే చాలు ఇక ఆ తర్వాత బ్యాటింగ్ లో చేలరేగి సెంచరీ చేయడం ఖాయం అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ 40, 50 పరుగులు చేసిన తర్వాత వికెట్ సమర్పించుకునే ఆటగాడు కాదు మంచి ఆరంభం దొరికింది అంటే కచ్చితంగా భారీ స్కోరుగా మలిచి సెంచరీ సాధిస్తాడు అంటూ వసిం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: