నా పెళ్లప్పుడు కూడా ఇంత ఒత్తిడి లేదు : చాహల్

praveen
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకుంది అనే విషయం తెలిసిందే. ఏకంగా ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో విజయం సాధించింది టీమిండియా. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి వన్డే మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో రెండో వన్డే మ్యాచ్ అంతకుమించి అనే ఉత్కంఠ తోనే ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. కేవలం స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు  మైదానంలో మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ళలో కూడా అదే స్థాయిలో ఒత్తిడి పెరిగి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 రెండో వన్డే వన్డే మ్యాచ్లో భాగంగా ఏకంగా 312 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఈ క్రమంలోనే లక్ష్యఛేదనలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 49.4 ఓవర్లలో ఇండియా టార్గెట్ ఛేదించింది అనే చెప్పాలి. ఇక జట్టులోని ప్రధాన బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేరిన సమయంలో అక్షర్ పటేల్ 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను అన్న విషయాన్ని ఇటీవల స్పిన్నర్ చాహల్ చెప్పుకొచ్చాడు.


 మ్యాచ్ చూస్తున్నంతసేపు తాను గోళ్ళు నములుతూ ఉన్నాను అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో డగౌట్ లో కూర్చోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నది అంటూ తెలిపాడు. ఇక తన పెళ్లప్పుడు కూడా ఇలాంటి ఒత్తిడి అనుభవించలేదు అంటూ సరదాగా కామెంట్ చేశాడు చాహల్. ఇక చాహల్ చేసిన కామెంట్ కి అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇక అదే సమయంలో అక్షర్  పటేల్, ఆవేశ్ ఖాన్ కూడా ఇక మ్యాచ్ గురించి మాట్లాడారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: