భారత్ మ్యాచ్ గెలిస్తే.. ఆ విండిస్ బ్యాట్స్మెన్ ప్రేక్షకుల మనసు గెలిచాడు?

praveen
ఇటీవలే భారత టీమిండియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. మొదటి వన్డే మ్యాచ్ మ్యాచ్ మాదిరిగానే  రెండో వన్డే మ్యాచ్ కూడా చివరి బంతి వరకు ఎవరు గెలుస్తాro అన్న  విధంగానే మారిపోయింది. మరోసారి ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది అనే చెప్పాలి. బ్యాట్ కి బంతి కి మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఇక స్టేడియం లో ఉన్న ప్రేక్షకులందరినీ ఉత్కంఠతో మునివేళ్ళపై నిలబెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన  మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే.


 అయితే ఉత్కంఠభరితంగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించినప్పటికీ అటు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకున్నాడు. రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ షైహోప్ సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇండియా తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అతని కెరీర్లో వందో వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఇక వందో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.


 100 వన్డే మ్యాచ్లో  సెంచరీతో అదరగొట్టిన పదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన 4 వ వెస్టిండీస్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ అతని వీరోచితమైన సెంచరీ మాత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కాగా వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయినా వెస్టిండీస్ జట్టు మూడో మ్యాచ్లో అయినా విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తుంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక మూడో వన్డే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారని కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టీమిండియా క్లీన్స్వీప్ పై కన్నేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: