నేడే రెండో వన్డే మ్యాచ్.. సిరీస్ పై కన్నేసిన టీం ఇండియా?
ఈ క్రమంలోనే మూడు వన్డేల సిరీస్లో భాగంగా 1-0 తేడాతో భారత జట్టు ఆధిక్యాన్ని సంపాదించింది అన్న విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ పర్యటనలో మాదిరిగానే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే దానిపై కన్నేసింది టీమిండియా. ఈ ఈ క్రమంలోనే నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే మొదటి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా కు ధీటుగా పోటీ ఇచ్చిన వెస్టిండీస్ రెండో వన్డే మ్యాచ్ లో ఎలా రాణించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు వెస్టిండీస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ టీమ్ ఇండియా జట్లు తలపడుతున్నాయి. అయితే భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనబడుతూ ఉంటే అటు వెస్టిండీస్ జట్టు బౌలింగ్ లో మాత్రం తేలిపోతుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు జరగబోయే రెండో వన్డే మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.