భారత్ ముందు సవాల్.. చావో రేవో తేల్చుకోవాల్సిందే?

praveen
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తుంది  అని చెప్పాలి. అయితే అద్భుతమైన విజయాలు సాధిస్తున్న మరోవైపు కూడా కొన్ని జట్లతో ఓటమి చవిచూసింది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇక భారత మహిళల జట్టు ముందు ఒక అతిపెద్ద సవాలు ఎదురైంది.  ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే డూ ఆర్ డై మ్యాచ్లో భారత జట్టు ఎలా రాణించ బోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్లు చేతులెత్తేయడం ఇక బౌలర్ల వైఫల్యమే కారణం గా భారత జట్టుకు ఓటమి తప్పలేదు.



 కెప్టెన్ మిథాలీ రాజ్ మరో బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. అయినప్పటికీ ఇక ఆ తర్వాత మిగతా ప్లేయర్స్ మాత్రం జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇక జట్టు ఓడిపోవడంతో ఇక ఇప్పుడు సెమీస్ అవకాశాలను భారత జట్టుకు ఎంతో క్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు సెమీస్ చేరుకోవాలి అంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.



 అయితే ఇక సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కి బంగ్లాదేశ్ జట్టు పై భారీ విజయం సాధించడంతో పాటు ఈ నెల 27వ తేదీన సౌత్ ఆఫ్రికా తో జరగబోయే మ్యాచ్ లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా మహిళా వరల్డ్ కప్ లో 5 మ్యాచ్లు ఆడింది భారత మహిళల జట్టు. పాకిస్తాన్ వెస్టిండీస్పై మాత్రమే విజయం సాధించగా.. న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో మిథాలీ సేన ఏం చేయబోతుందో అన్నది ప్రస్తుతం ఉత్కంఠకు తెర లేపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: